Sakshi News home page

వెఎస్సార్‌సీపీలో యువ బ్రాహ్మణ సంఘం నాయకుల చేరిక

Published Fri, Jul 20 2018 5:58 AM

Youth Brahmin Join In YSRCP East Godavari - Sakshi

తూర్పుగోదావరి  ,అంబాజీపేట: వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే మేమంతా ఉండి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని కాకినాడకు చెందిన యువ బ్రాహ్మణ సంఘ నాయకులు అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కాకినాడ క్యాంపు కార్యాలయంలో వైఎస్‌.జగన్‌ సమక్షంలో బుధవారం పార్టీలో చేరారు. కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, కో ఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో యువ బ్రాహ్మణ సంఘ నాయకులు ఆకెళ్ళ మురళీకృష్ణ, వీఆర్‌జె దిలీప్, భమిడిపాటి మూర్తి, ఎస్‌.విష్ణుమూర్తి, వేదుల మణిలతో పాటు 45 మంది జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు.

పార్టీలో చేరిన వారికి జగన్‌ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో అన్ని వర్గాల ప్రజలకు అందించిన సువర్ణ పాలన జగన్‌తోనే సాధ్యమవుతుందన్నారు. పార్టీ ప్రవేశపెట్టిన నవరత్నాలు ఎంతో మంది పేద ప్రజలకు మేలు చేస్తాయన్నారు. పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలకు ఆకర్షితులమై పార్టీలో చేరామన్నారు. ప్రజా సంకల్ప యాత్రకు రాష్ట్ర స్థాయిలో బ్రహ్మరథం పడుతున్నారన్నారు. జగన్‌ సీఎం అయ్యేంత వరకు ఆయన వెన్నంటి ఉండి ముందుకు సాగుతామన్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement