285వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర | Sakshi
Sakshi News home page

285వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

Published Sun, Oct 14 2018 7:17 AM

YS Jagan 285th Day PrajasankalpaYatra Begins  - Sakshi

సాక్షి, గజపతినగరం(విజయనగరం జిల్లా): ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 285వ రోజు ఆదివారం ఉదయం కోమటి పల్లి నుంచి ప్రారంభమైంది. ఆయన వెంట నడిచేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ జననేత పాదయాత్ర సాగిస్తున్నారు.

అడుగడునా సమస్యలు తెలుసుకుంటూ వైఎస్‌ జగన్‌ ముందుకు కదులుతున్నారు. వైఎస్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. గజపతినగరం నియోజకవర్గంలోని తాడెందొరవలస క్రాస్‌, కుంటినవలస క్రాస్‌, మరడాం, షికారుగంజి క్రాస్‌, కె. కొత్తవల క్రాస్‌ మీదుగా ఎస్‌ బూర్జవలస వరకు ఈ రోజు పాదయాత్ర సాగనుంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement