రాజన్నా...రా ‘జగన్‌’ అన్నా బ్రోచర్‌ ఆవిష్కరణ | Sakshi
Sakshi News home page

రాజన్నా...రా ‘జగన్‌’ అన్నా బ్రోచర్‌ ఆవిష్కరణ

Published Wed, Nov 28 2018 7:56 AM

YS Jagan Brochure launch in Praja Sankalpa Yatra - Sakshi

శ్రీకాకుళం అర్బన్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజన్నా... రా ‘జగన్‌’ అన్నా బ్రోచర్‌ను బుధవారం ఆవి ష్కరించారు. నవగాం క్రాస్‌ వద్ద శిబిరంలో ఈ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్రోచర్‌ రూపకర్తలు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌ రాజశేఖరరెడ్డి 2003లో మండు వేసవిలో పాదయాత్ర ప్రారంభించి విజయవంతంగా ముగించారన్నారు. 2004లో  వైఎస్‌ సీఎం అయ్యాక ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజారంజక పాలక చేపట్టారన్నారు. వైఎస్‌ సంక్షేమ పథకాలు, సేవలను చిన్న పుస్తకరూపంలో తెలియజేయడం జరిగిందన్నారు. ఈ బ్రోచర్‌లు 10వేల కాపీలను ప్రచురించడం జరిగిందని, వీటిని త్వరలోనే పంపిణీ చేస్తామన్నారు. దివంగత వైఎస్‌ అడుగుజాడల్లోనే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నడుస్తూ ప్రజాసంకల్ప పాదయాత్ర చేపట్టారన్నారని, ఇది విజయవంతం కావాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో బ్రోచర్‌ రచయిత చల్లా కృష్ణవీర్‌ అభిషేక్, నిఖిత, రాజు, సురేష్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement