రైలు ప్రమాద ఘటనపై వైఎస్ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి | Sakshi
Sakshi News home page

రైలు ప్రమాద ఘటనపై వైఎస్ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి

Published Sun, Jan 22 2017 7:30 AM

రైలు ప్రమాద ఘటనపై వైఎస్ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి - Sakshi

హైదరాబాద్ : విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
 

Advertisement
Advertisement