225వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 31 2018 8:54 AM

Ys jagan Day 225 Praja Sankalpa Yatra Begins - Sakshi

సాక్షి, పిఠాపురం (తూర్పుగోదావరి) : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 225వ రోజు ప్రారంభమైంది. మంగళవారం ఉదయం ఆయన పిఠాపురం నియోజకవర్గంలోని విరవ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. జననేత వైఎస్‌ జగన్‌తో కలిసి నడిచేందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు.

స్థానికులు తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. వారికి భరోసా కల్పిస్తూ రాజన్నతనయుడు ముందుకు సాగుతున్నారు. విరవ నుంచి విరావాడ, ఎఫ్‌కే పాలెం కుమారపురం మీదుగా పిఠాపురం వరకు పాదయాత్ర కొనసాగుతోంది. పిఠాపురంలో సాయంత్రం నిర్వహించే బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ పాల్గొంటారు. 

Advertisement
Advertisement