ఇచ్ఛాపురం దాకా జగనన్న వెంటే.. | Sakshi
Sakshi News home page

ఇచ్ఛాపురం దాకా జగనన్న వెంటే..

Published Tue, Nov 7 2017 8:50 AM

ys jagan fan follows the his praja sankalpa yatra - Sakshi

బద్వేలు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందినవారు ఆయనను నిత్యం స్మరించుకుంటున్నారు. వైఎస్‌ కుటుంబంపై అంతులేని అభిమానం కనబరుస్తున్నారు. ఇందుకు నిదర్శనం అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన నాగరాజు, కళ్యాణదుర్గం మండలం శెట్టూరుకు చెందిన సోమనాథరెడ్డి. వీరికి వైఎస్‌ పరిపాలనలో పక్కా ఇళ్లు దక్కాయి. రుణమాఫీ ద్వారా ప్రయోజనం పొందారు. మహానేత మరణంతో రాష్ట్రం అభివృద్ధికి దూరమైందని ఆవేదన చెందారు.

 ఈ నేపథ్యంలో వైఎస్‌ కుటుంబానికి అండగా నిలవాలని భావించారు. ఆ సమయంలో షర్మిల చేపట్టిన పాదయాత్రకు చూసేందుకు ఇడుపులపాయకు వచ్చారు. కానీ, చూసి వెళ్లిపోలేదు. ఆమె వెంట ఇచ్ఛాపురం వరకు దాదాపు 3,200 కిలోమీటర్లు నడిచారు. ఎన్ని ఇబ్బందులెదురైనా వెనక్కి తగ్గలేదు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర చేపడుతున్నారని తెలుసుకుని నాగరాజు, సోమనాథరెడ్డి సోమవారం ఇడుపులపాయకు చేరుకున్నారు. జగన్‌ వెంటే అడుగులో అడుగై నడవాలని నిర్ణయించుకున్నారు. బ్యాగులు సర్దుకుని ఇడుపులపాయ నుంచి యాత్రలో ముందుకు సాగారు. ఇచ్ఛాపురం దాకా జగనన్నకు తోడుగా నిలిస్తామని దృ«ఢంగా చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement