వైఎస్సార్ కాంగ్రెస్ ప్లీనరీ ఏర్పాట్లపై సమీక్ష... ముఖ్య నేతల హాజరు
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలను ప్రతిష్టాత్మంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. సోమవారం ఆయన తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై ప్లీనరీ నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించారు. గుంటూరు – విజయవాడ మధ్య గల ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఎంపిక చేసిన స్థలంలో జూలై 8, 9 తేదీల్లో ప్లీనరీ సమావేశాలు జరగాలని నిర్ణయించిన విషయం విదితమే. పార్టీ పిలుపు నిచ్చిన విధంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్లీనరీలు చాలా బాగా జరిగాయని జగన్ సంతృప్తిని వ్యక్తం చేశారు. కింది స్థాయి నుంచీ చాలా ఉత్సాహంగా జరిగిన ఈ సమావేశాల వల్ల పార్టీ శ్రేణులకు మంచి ఊపు నిచ్చిందని సమావేశంలో అభిప్రాయపడ్డారు.
నిర్మాణాత్మకంగా పార్టీ పటిష్టతకు ఈ సమావేశాలు ఎంతో ఉపయోగపడ్డాయని కూడా ప్రస్తావించారు. అసెంబ్లీ ప్లీనరీల విజయవంతం కావడం ప్రజాభీష్టాన్ని సూచిస్తోందని కూడా నేతలు పేర్కొన్నారు. జిల్లా ప్లీనరీలను కూడా ఇదే ఒరవడిలో పూర్తవుతాయనే ఆశాభావం వ్యక్తం అయింది. రాజధాని ప్రాంతంలో రాష్ట్ర స్థాయి ప్లీనరీ జరుగుతోందని కనుక దాని ప్రభావం గుంటూరు, కృష్ణా జిల్లాలపై బాగా ఉంటుందనే విషయం చర్చించారు. టీడీపీ ప్రజా వ్యతిరేక పాలనపై ప్రజల్లో అసహనం పెరుగుతోందనేది స్పష్టంగా వెల్లడవుతోంది కనుక వచ్చే రెండేళ్లలో ఎన్నికల వరకూ ప్రభుత్వంపై పోరాటానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను కూడా ఈ ప్లీనరీలో సిద్ధం చేయాలని నిర్ణయించారు.
అందుకు అనుగుణంగా తీర్మానాలు చేయాలని అభిప్రాయపడ్డారు. ప్లీనరీని సమర్థవంతంగా నిర్వహించడానికి వివిధ కమిటీల నియామకంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. మళ్లీ ఈ నెల 23వ తేదీన ప్లీనరీ ఏర్పాట్ల సమీక్షపై నేతలు సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి, వేణుంబాక విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి,, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, కొలుసు పార్థసారథి, భూమన కరుణాకర్రెడ్డి, ఎస్.దుర్గాప్రసాదరాజు, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్ పాల్గొన్నారు.
ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా జరపాలి: జగన్
Published Tue, Jun 20 2017 1:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రత్నగిరిపై కుండపోత
షెల్టర్ శ్లాబు కూలి యువకుడి మృతి
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
పిడుగు పడి మేకల కాపరి మృతి
జగన్తోనే సంక్షేమం
కోనసీమలో పలుచోట్ల అకాల వర్షం
హమ్మయ్య చల్లబడింది
IPl 2024: శాంసన్ ఇన్నింగ్స్ వృథా.. రాజస్తాన్పై ఢిల్లీ ఘన విజయం
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement