193వరోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర | Sakshi
Sakshi News home page

193వరోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

Published Tue, Jun 19 2018 9:06 AM

Ys Jagan Mohan Reddy 193 Day Prajasankalpayatra Begins - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 193వ రోజు ప్రారం‍భమైంది. మంగళవారం ఉదయం  పి.గన్నవరం నుంచి  ఆయన పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి లంకల గన్నవరం, మండెపులంక, కందలపాలెం మీదుగా నాగుల్లంక వరకు నేటి ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతుంది. 

జననేత వైఎస్‌ జగన్‌ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభించింది. ఇక ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నారు. వారి సమస్యలను విన్న వైఎస్‌ జగన్, భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.

Advertisement
Advertisement