205వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర | Sakshi
Sakshi News home page

205వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

Published Wed, Jul 4 2018 8:35 AM

YS Jagan Mohan Reddy 205Day Padayatra Begins - Sakshi

సాక్షి, రామచంద్రాపురం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 205వ రోజు ప్రారంభమైంది. జననేత పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా వైఎస్‌ జగన్‌ అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి కుయ్యేరు, బాలాంత్రం, ఎర్రపోతవరం, వేగాయమ్మ పేట మీదుగా ద్రాక్షారామం వరకు పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగించనున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement