జగన్ రోడ్డు షోకు అడుగడునా ఘన స్వాగతం | Sakshi
Sakshi News home page

జగన్ రోడ్డు షోకు అడుగడునా ఘన స్వాగతం

Published Tue, Mar 4 2014 12:23 PM

జగన్ రోడ్డు షోకు అడుగడునా ఘన స్వాగతం - Sakshi

ఏలూరు : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా దూబచర్ల జనసంద్రంగా మారింది. జగన్ రోడ్డు షోకు దూబచర్ల ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. రాజన్న తనయుడిని చూసేందుకు జనం గంటల తరబడి రోడ్లపై బారులు తీరారు.వైఎస్ఆర్ జనభేరిలో భాగంగా జగన్మోహనరెడ్డి నేడు పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం, కొవ్వూరు నియోజకవర్గాలలో పర్యటిస్తున్నారు.

గంటావారిగూడెం నుంచి ఈరోజు పర్యటన ప్రారంభమైంది. దూబచర్ల, నల్లజర్ల, అనంతపల్లి , దేవరపల్లి, పంగిడి, బ్రాహ్మణగూడెంలలో పర్యటించి సాయంత్రానికి నిడదవోలు చేరుకుంటారు. గణేష్‌చౌక్ సెంటర్‌లో భారీ బహిరంగ సభ అనంతరం చింతలపూడిలో జగన్ రాత్రి బస చేస్తారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement