జగన్‌కు ఘనంగా వీడ్కోలు | Sakshi
Sakshi News home page

జగన్‌కు ఘనంగా వీడ్కోలు

Published Fri, Nov 15 2013 1:05 AM

ys jagan mohan reddy grand farewell in Madhurapudi airport

మధురపూడి, న్యూస్‌లైన్ :జిల్లాలో రెండు రోజుల పర్యటన అనంతరం తిరిగి హైదరాబాద్ వెళుతున్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి గురువారం మధురపూడి విమానాశ్రయంలో పార్టీ నేతలు, అభిమానులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఉదయం 10 గంటలకు జగన్ ప్రత్యే క విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పార్టీ ప్రతినిధులు, కోఆర్డినేటర్లు, కన్వీనర్లు విమానాశ్రయంలో సాదరంగా వీడ్కోలు చెప్పారు. పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బా యి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కరరామారావు, ఆదిరెడ్డి అప్పారావు, మాజీ మంత్రి  పిని పే విశ్వరూప్, తాజామాజీ ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖరరెడ్డి, రాష్ట్ర మహిళావిభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి, ీ
 
సజీసీ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, నర్సాపురం, కాకినాడ, రాజమండ్రి పార్లమెం ట్ నియోజకవర్గాల నేతలు రఘురామకృష్ణం రాజు, చలమలశెట్టి సునీల్, బొడ్డు వెంకటరమణచౌదరి విమానాశ్రయంలో జగన్‌ను కలసి వీడ్కోలు పలికారు. వివిధ నియోజకవర్గాల పార్టీ కోఆర్డినేటర్లు చెల్లుబోయిన వేణు, తోట సుబ్బారావునాయుడు, మిండగుదిటి మోహ న్, విపర్తి వేణుగోపాలరావు, దాడిశెట్టి రాజా, బొమ్మన రాజ్‌కుమార్, అనంత ఉదయభాస్కర్, ఆకుల వీర్రాజు, మట్టా శైలజ, గుత్తుల సాయి, కొండేటి చిట్టిబాబు, అనుబంధ విభాగాల కన్వీనర్లు డాక్టర్ యనమదల మురళీకృష్ణ, కర్రి పాపారాయుడు, శెట్టిబత్తుల రాజబాబు,
 
రాష్ట్ర యూత్ కమిటీ సభ్యులు తాడి విజయభాస్కరరెడ్డి, వాసిరెడ్డి జమీలు, కాకినాడ కన్వీనర్ ఫ్రూటీకుమార్, పార్టీ ట్రేడ్‌యూనియన్ నాయకుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, ములగాడ ఫణి, రావి పాటి రామచంద్రరావు, జక్కంపూడి రాజా, భూపతిరాజు సుదర్శనబాబు, చోడిశెట్టి రాఘవబా బు, నక్కా రాజబాబు, మార్గన గంగాధర్, చింతపల్లి చంద్రం, మేడిశెట్టి శివరాం, గణేశుల పోసియ్య, రాయపురెడ్డి చిన్నా వీడ్కో లు పలికారు. కాగా అంతకుముందు కాకినాడ లో తాజామాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర శేఖరరెడ్డి నివాసంలో జగన్‌ను పలువురు నేతలు కలుసుకున్నారు. 
 

Advertisement
Advertisement