హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కలిశారు. వైఎస్ఆర్ సీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు ఏపీ మంత్రి వర్గంలో చోటు కల్పించడంపై ఆయన ఈ సందర్భంగా గవర్నర్కు ఫిర్యాదు చేశారు. మంత్రి పదవులు పొందిన నలుగురు అధికారికంగా వైఎస్ఆర్ సీపీలోనే ఉన్నారని వైఎస్ జగన్ ...గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లారు. ప్రజాస్వామ్యంలో ఇలా చేయడంతో రాజ్యాంగాన్ని కాలరాయడమే అని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గవర్నర్ కు ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు.
కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, అమర్నాథ్ రెడ్డి, అఖిలప్రియ, సుజయకృష్ణ రంగారావుకు ఏపీ మంత్రివర్గంలో స్థానం కల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, పార్టీ ఫిరాయించినవారికి మంత్రి పదవులు ఎలా ఇస్తారని వైఎస్ జగన్ ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్ వెంట పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు కోన రఘుపతి, బాలనాగిరెడ్డి, పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఉన్నారు.
గవర్నర్కు వైఎస్ జగన్ ఫిర్యాదు
Published Mon, Apr 3 2017 3:37 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement