సాక్షి, జక్కారం (పశ్చిమ గోదావరి జిల్లా) : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 173వ రోజు షెడ్యూల్ ఖరారైంది. ఆదివారం ఉదయం జక్కారం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. గొపల్లె, పెద అమిరం, చిన అమిరం, మీదుగా భీమవరం వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి వైఎస్ జగన్ అక్కడే బస చేస్తారు. సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన వారు జననేత వైఎస్ జగన్ను నేరుగా కలుసుకుని మాట్లాడవచ్చు. ఈ మేరకు వైఎస్సార్సీపీ ఏపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.
జక్కారంలో ముగిసిన పాదయాత్ర
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో 172వ రోజు ప్రజాసంకల్పయాత్ర జక్కారంలో ముగిసింది. ఇవాళ 12.5 కిలోమీటర్లు నడిచిన వైఎస్ జగన్ ఇప్పటి వరకు మొత్తం 2157.2 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. శనివారం ఉదయం ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి కుప్పన పుడి, కొలనపల్లి, కాళ్ల, సీసలి క్రాస్ రోడ్డు మీదుగా జక్కారం వరకు జననేత పాదయాత్ర కొనసాగింది.