మీడియానే స్పీకర్లు అయినప్పుడు ప్రజలకు మేలు: వైఎస్ జగన్ | Sakshi
Sakshi News home page

మీడియానే స్పీకర్లు అయినప్పుడు ప్రజలకు మేలు: వైఎస్ జగన్

Published Fri, Mar 20 2015 11:15 AM

మీడియానే స్పీకర్లు అయినప్పుడు ప్రజలకు మేలు: వైఎస్ జగన్ - Sakshi

హైదరాబాద్ : ప్రజల తరపున స్పీకర్లుగా మీడియా రావడం చాలా ఆనందంగా ఉందని ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.  శాసనసభలో నిన్న జరిగిన పరిణామాలపై ఆయన శుక్రవారం ఉదయం లోటస్పాండ్లో ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ మీడియానే స్పీకర్లు అయినప్పుడు ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ సందర్భంగా తన ప్రసంగానికి ప్రతిసారీ అంతరాయం ఏర్పడిందన్నారు.

వైఎస్ జగన్ ప్రెస్మీట్లో ముఖ్యాంశాలు:

# ప్రణాళికేతర వ్యయంలో ఏకంగా రూ.11వేల కోట్లు తగ్గించారు.  
# బడ్జెట్ లో కేటాయింపుల పెరుగుదల కనిపించలేదు
# బడ్జెట్లో ఖర్చులు ఎట్టి పరిస్థితుల్లోనూ రూ.80 వేల కోట్లు మించి లేదు
# కాదు కూడదు అంటే..90 వేల కోట్లు, కానీ లక్షా 12వేల కోట్లు ఎందుకు చూపించారో అర్థం కావటంలేదు
# అకౌంట్లను పెంచి చూపించడం, మోసం చేయడం, అబద్దాలు చెప్పడం...
# వెన్నుపోట్లు పొడవడం కాదు..భవిష్యత్ తరాలకు నేర్పించాల్సి ఉంది

# బడ్జెట్లో లెక్కలను పెంచి చూపిస్తే ఢిల్లీలో మన రాష్ట్ర పరువు ఏమవుతుంది
# మన రాష్ట్రం గురించి, మన ప్రజల గురించి వాళ్లు ఏమనుకుంటారు
# రైతుల రుణమాఫీ గురించి ప్రస్తావించగానే నేరుగా స్పీకరే పిక్చర్లోకి వచ్చారు
# రైతుల టాపిక్ గురించి మాట్లాడకూదని స్పీకర్ చెప్పారు
# ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదో స్పీకరే నిర్దేశించే పరిస్థితి

# రైతుల రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు మేనిఫెస్టోలో పేర్కొన్నారు
# ఎన్నికల సంఘానికి వీటిని నెరవేరుస్తామని లేఖలు కూడా రాశారు
# రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తి అవగాహన ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు
# ఎన్నికల సమయంలో ఎక్కడకు వెళ్లినా... ఇవే హామీలు ఇచ్చారు
# బ్యాంకుల్లో బంగారం రావాలంటే..బాబే రావాలని ప్రతి టీవీల్లో ప్రకటనలు ఇచ్చారు
# ఏ గోడమీద చూసినా..జాబు రావాలంటే..బాబు రావాలని చెప్పారు
# ప్రతిమీటింగ్లోనూ రైతు రుణమాఫీ చేస్తానని చెప్పారు

# చంద్రబాబే సంతకం పెట్టిన లేఖను ప్రతి ఇంటికీ కార్యకర్తల చేత లేఖలు పంపించారు
# చంద్రబాబు సంతకం చేసి లేఖ ఇది..స్వయంగా మీ ఇంటికి పంపించారంటూ ఇంటింటికీ పంచారు
# రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానని కుటుంబాలకు రాసిన లేఖలో చెప్పారు
# డ్వాక్రా సంఘాల రుణాలను రద్దు చేస్తామని చెప్పారు.

# ఉద్యోగం, ఉపాధి కల్పించేంత వరకూ ప్రతి నిరుద్యోగస్తుడికీ రూ.2వేల భృతి ఇస్తామన్నారు
# చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మారు, ఆయన్ని ముఖ్యమంత్రిని చేశారు
# చంద్రబాబు ప్రమాణస్వీకారం సమయంలో సాక్షాత్తూ ప్రభుత్వమే ఈనాడు దినపత్రికలో ప్రకటన వేయించింది
# వ్యవసాయ రుణాలు రద్దు, డ్వాక్రా రుణాలు రద్దు, ఇంటికో ఉద్యోగం అంటూ ప్రకటన వేశారు

# సీఎం అయిన తర్వాత చంద్రబాబు బ్యాంకర్లతో సమావేశం అయ్యారు
# జూన్ 30న 184వ రాష్ట్ర బ్యాంకర్ల సమావేశం జరిగింది
# ఈ సమావేశంలో చంద్రబాబుకు బ్యాంకర్లు వివరాలు అందించారు
# 87 వేల 612 కోట్లకు పైగా వ్యవసాయ రుణాలు ఉన్నాయని బ్యాంకర్లు చంద్రబాబుకు చెప్పారు
# డ్వాక్రా సంఘాల రుణాలు రూ.14204 కోట్లని చంద్రబాబుకు బ్యాంకర్లు చూపించారు
# ఇవన్నీ 2014, మార్చి 31 నాటికి ఉన్న డేటాను చంద్రబాబుకు చూపించారు
# ప్రతి ఏడాది ఉన్న రుణాల వివరాలను కూడా చూపించారు

# రైతులు రుణాలు కట్టేందుకు సుముఖంగా లేరని కూడా చంద్రబాబుకు బ్యాంకర్లు చెప్పారు
# రైతులు రుణాలు కట్టలేదు కాబట్టి పంటల బీమా కూడా అందదని చంద్రబాబుకు స్పష్టం చేశారు
# రుణాలు కట్టలేనందున వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీల్లాంటి ప్రయోజనాలు ఇకపై ఉండవని స్పష్టం చేశారు
# సరిగ్గా 6 నెలల తర్వాత 188వ బ్యాంకర్ల సమావేశం జరిగింది. అది కూడా చంద్రబాబు అధ్యక్షతన జరిగింది
# రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు 30-09-2014 నాటికి తడిసి మోపిడై రూ.99,555 కోట్లు అయ్యాయని బాబుకు వివరించాయి
# ఇంతకు ముందు రైతుకు సున్నా వడ్డీకి, పావలా వడ్డీకి వచ్చే రుణాలపై రైతులు ఇప్పుడు 14 శాతం వడ్డీ కడుతున్నారు

# పంట రుణాల లక్ష్యాన్ని అనుకున్నదానికన్నా ఎక్కువ వచ్చిన విషయాన్ని గుర్తు చేశాయి
# కాని రుణాలు కట్టలేనందువల్ల ఈసారి ఇవ్వలేకపోయాయని చెప్పాయి
# రూ.56వేల కోట్ల రుణాలు రైతులకు ఇవ్వాలనుకున్న బ్యాంకులు కేవలం రూ.13781 కోట్లు మాత్రమే ఇవ్వగలిగాయి
# మిగిలిన రూ.40వేల కోట్లకు పైగా రుణాలను బ్యాంకులు గడప తొక్కలేక రైతులు బయట అప్పులు తెచ్చుకుంటున్నారు

Advertisement
Advertisement