వైఎస్‌ అడుగు జాడల్లోనే నా పయనం | Sakshi
Sakshi News home page

వైఎస్‌ అడుగు జాడల్లోనే నా పయనం

Published Sun, Jul 9 2017 4:31 AM

వైఎస్‌ అడుగు జాడల్లోనే నా పయనం - Sakshi

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్‌ 
 
సాక్షి, అమరావతి: వైఎస్‌ అడుగు జాడల్లోనే తన పయనం సాగుతుందని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ట్విటర్‌లో ట్వీట్‌ చేశారు.  వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని ఈ మేరకు ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు. ‘ప్రజలను చూసినపుడల్లా వారిలో నాకు దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కనిపిస్తారు.

ప్రజలు నా మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలు నాన్న గారిని తలపిస్తాయి. మహానేత అడుగు జాడల్లో ఆయన చూపిన బాటలోనే పయనిస్తాను. సర్వదా నేను రుణపడి ఉంటాను’ అని ట్వీట్‌ చేశారు.
Advertisement
Advertisement