రాజమౌళితో మాస్టర్ప్లాన్ వేయిస్తారట | Sakshi
Sakshi News home page

రాజమౌళితో మాస్టర్ప్లాన్ వేయిస్తారట

Published Thu, Jan 19 2017 2:49 PM

ys jagan mohan reddy visits  nidumarru

నిడుమర్రు: చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, రాజధాని ప్రాంత రైతులకు అండగా ఉంటామని వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి అన్నారు. బలవంతంగా ఎవరి దగ్గర భూములు తీసుకోబోమని ల్యాండ్‌ పూలింగ్‌ సమయంలో చెప్పిన చంద్రబాబు ఇప్పుడేమో బలవంతంగా భూములు లాక్కొంటున్నారని విమర్శించారు. రాజధాని ప్రాంతంలో తాను పర్యటించకుండా ఆంక్షలు విధించడం సిగ్గుచేటని అన్నారు. గురువారం గుంటూరు జిల్లా నిడుమర్రులో వైఎస్‌ జగన్ రైతులతో ముఖాముఖి మాట్లాడారు.

వైఎస్‌ జగన్‌ రైతులతో మాట్లాడుతూ.. ‘ఏ గ్రామాలకు వెళ్లకుండా కట్టడి చేశారో ఆ గ్రామాల వారు కూడా ఇక్కడికి వచ్చారు. మీరు పడుతున్న ఇబ్బందులను మీ నోటి ద్వారానే చెప్పండి. మీ మాటల ద్వారా అయినా చంద్రబాబుకు బుద్ధి, జ్జానం వస్తుందేమో? మీ పోరాటానికి వైఎస్ఆర్ సీపీ ఎప్పుడూ అండగా ఉంటుంది. మీరు పడుతున్న బాధలను చెప్పండి. నేను, రాష్ట్ర ప్రజలు, చంద్రబాబు వింటారు’ అని అన్నారు.



Advertisement

తప్పక చదవండి

Advertisement