త్వరలో జగన్ రాష్ట్ర పర్యటన: కొణతాల | Sakshi
Sakshi News home page

త్వరలో జగన్ రాష్ట్ర పర్యటన: కొణతాల

Published Fri, Nov 1 2013 4:15 PM

త్వరలో జగన్ రాష్ట్ర పర్యటన: కొణతాల - Sakshi

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి త్వరలోనే రాష్ట్ర పర్యటన చేస్తారని పార్టీ నాయకుడు కొణతాల రామకృష్ణ తెలిపారు. అఖిలపక్ష సమావేశం కంటే ముందుగానే శ్రీకృష్ణ కమిటీ నివేదికను బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇక పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మపై దాడిని ప్రతి ఒక్కరు ఖండించాలని కొణతాల అన్నారు. మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌లు తమ పదవుల పరువు తీసేలా ప్రవర్తించారని విమర్శించారు. వైఎస్ విజయమ్మను పోలీసులు అడ్డుకోవడాన్ని తాము మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement