Sakshi News home page

249వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

Published Tue, Aug 28 2018 8:25 PM

YS Jagan PrajaSankalpaYatra 249th Day Schedule Released - Sakshi

సాక్షి, యలమంచిలి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 249వ రోజు షెడ్యూలు ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం జననేత యలమంచిలి నియోజకవర్గంలోని మునగపాక రోడ్డు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మునగపాక, గంగాదేవి పేట క్రాస్‌, ఒంపోలు మీదుగా నాగులపల్లి వరకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగనుంది. అక్కడ వైఎస్‌ జగన్‌ భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో పాదయాత్ర పునః ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పాదయాత్ర అనకాపల్లి నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. అనకాపల్లి మీదుగా తుమ్మపాల వరకు జననేత పాదయాత్ర కొనసాగుతుంది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

ముగిసిన పాదయాత్ర: వైఎస్‌ జగన్‌ 248వ రోజు పాదయాత్ర మంగళవారం మునగపాక రోడ్డు వద్ద ముగిసింది. నేడు కొండకర్ల క్రాస్‌ నుంచి ప్రారంభమైన జననేత పాదయాత్ర కొండకర్ల జంక్షన్‌, హరిపాలెం జంక్షన్‌, తిమ్మరాజు పేట, పెద్దపాడు క్రాస్‌ మీదుగా మునగపాక రోడ్డు వరకు 5.1 కిలోమీటర్లు సాగింది. ఇప్పటివరకు వైఎస్‌ జగన్‌ 2832 కిలోమీటర్లు నడిచారు.


 

Advertisement

What’s your opinion

Advertisement