వేలాది మంది జనం సాక్షిగా, పార్టీ నేతలు, కార్యకర్తల జైజగన్ నినాదాల నడుమ శనివారం ప్రజా సంకల్ప యాత్ర మరో మైలు రాయిని అధిగమించింది. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో గత ఏడాది నవంబర్ 6వ తేదీన ఒక్క అడుగుతో మొదలైన ఈ యాత్ర.. వందలు.. వెయ్యి.. రెండు వేలు.. మూడు వేలు దాటుకుని 3,500 కిలోమీటర్లనూ అధిగమించింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని రావివలస ఈ చారిత్రక ఘట్టానికి వేదికైంది. ఇందుకు గుర్తుగా జగన్ మామిడి మొక్కను నాటారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇప్పటిదాకా పాదయాత్ర సాగిన జిల్లాల్లో ఆబాలగోపాలం వైఎస్ జగన్ వెంట అడుగులో అడుగేసింది. పాలకుల మోసాలను, అవినీతిని, అబద్ధాల పురాణాన్ని జగన్ ఊరూరా నడిరోడ్డులో నిగ్గదీసి కడిగేస్తుంటే అన్ని వర్గాల ప్రజలు జైకొట్టారు. జగన్ సీఎం అయితేనే అందరి కష్టాలు తీరతాయని ఆకాంక్షించారు. ‘అన్నా.. నాలుగున్నరేళ్లుగా కష్టాలే.. అడుగడుగునా వేధింపులే.. ఇక భరించలేం.. మేమంతా మీ వెంటే.. ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని సాగనంపుతాం..’ అంటూ మహిళలు, యువత బహిరంగంగా శపథం చేయడం కనిపించింది.
మన బాగు కోసం రాజన్న బిడ్డ నడుచుకుంటూ వస్తున్నాడని అవ్వాతాతలు ఓపికతో ఎదురు చూస్తుండటమూ కనిపించింది. ఇన్నాళ్లూ మోసపోయాం.. మీరే మా నాయకుడంటూ జగన్ను తాడిత, పీడిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలు అక్కున చేర్చుకుని కష్టాలు ఏకరువు పెట్టడం.. వారందరికీ జగన్ ధైర్యం చెప్పడమూ చూశాం. దారిపొడవునా జగన్ అందరి కష్టాలు ఓపికతో విని ధైర్యం చెబుతూ, భవిష్యత్తుపై భరోసా ఇస్తున్న తీరు ‘లీడర్ అంటే ఇలా ఉండాలి’ అనేలా చేసింది. పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని వారి చేష్టలే చెప్పకనే చెబుతున్నాయి. టెక్కలిలో సభకు జనం రాకుండా చేయాలని పడరాని పాట్లు పడటం కనిపించింది. ఇదే రోజు సీఎం శ్రీకాకుళంలో ధర్మపోరాట దీక్ష అంటూ సభ ఏర్పాటు చేశారు. భారీగా బస్సులు, లారీలు, కార్లు పంపారు. ఇవేవీ జగన్ సభకు తరలి వస్తున్న జనాన్ని ఆపలేకపోవడం చూస్తుంటే ఎంతగా ఆదరణ ఉందో తెలుస్తోంది. 3,500 కి.మీ అధిగమించి చారిత్రక ఘట్టానికి వేదికైన రావివలసలో జగన్కు జనం ఘన స్వాగతం పలికారు.
– టెక్కలి
పాదయాత్ర @ 3500 కిలోమీటర్లు
Published Sun, Dec 23 2018 5:16 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement