బొబ్బిలిలో 17న జగన్‌ సభ | Sakshi
Sakshi News home page

బొబ్బిలిలో 17న జగన్‌ సభ

Published Mon, Oct 15 2018 6:42 AM

YS Jagan Public Meeting In Bobbili at 17th october  - Sakshi

బొబ్బిలి రూరల్‌: వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఈ నెల 17న బొబ్బిలి పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రొగ్రామ్స్‌ కమిటీ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం తెలిపారు. ఇక్కడి కళాభారతి ఆడిటోరియం వద్ద బహిరంగ సభ ఏర్పాటుకు ఆయన ఆదివారం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. జగన్‌ పాదయాత్ర రూట్‌ను నియోజకవర్గ సమన్వయకర్త శంబంగి వెంకట చినఅప్పలనాయుడుతో కలిసి పరిశీలించారు.

 బహిరంగసభ అనంతరం బసచేసే గ్రోత్‌సెంటర్‌ ప్రాంతాన్ని పరిశీలించి శంబంగి సోదరులు శంబంగి వేణుగోపాలనాయుడికి పలు సూచనలు చేశారు. ఏయే ప్రాంతాల్లో జగన్‌ పాదయాత్ర చేయాల్సి ఉందీ, ఏయే ఏర్పాట్లు చేయాలో చర్చించారు. అనంతరం పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటుచేసి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త శంబంగి వెంకటచినఅప్పలనాయుడుతో పాటు తూముల రామసుధీర్, ఇంటి గోపాలరావు, సావు కృష్ణమూర్తినాయుడు, రేజేటి విసు, గుల్లిపల్లి అప్పలనాయుడు, బొద్దల సత్యనారాయణ, దిబ్బగోపి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement