నెల్లిమర్లలో రేపు జగన్‌సభ | Sakshi
Sakshi News home page

నెల్లిమర్లలో రేపు జగన్‌సభ

Published Tue, Oct 2 2018 7:41 AM

YS Jagan Public meeting In nellimarla Tomarrow - Sakshi

విజయనగరం : నెల్లిమర్ల: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న ప్రజా సంకల్పయాత్రలో భాగంగా నియోజకవర్గ కేంద్రమైన నెల్లిమర్లలో ఈ నెల 3న బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రొగ్రామ్స్‌ కోఆర్డినేటర్‌ తలశిల రఘురాం తెలిపారు. ఈ మేరకు పట్టణంలోని మొయిద జంక్షన్లో నిర్వహించనున్న సభా స్థలాన్ని పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ పెనుమత్స సురేష్‌బాబు, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సింగుబాబు, మండల కన్వీనర్‌ చెనమల్లు వెంకటరమణ, జెడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయుడు, యూత్‌ లీడర్‌ హర్షవర్ధన్‌లతో కలిసి సోమవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ ఈ నెల 2న మంగళవారం మధ్యాహ్నం కొండవెలగాడకు చేరుకునే జననేత అక్కడే రాత్రి బసచేస్తారని వివరిం చారు. బుధవారం ఉదయం కొండవెలగాడ–నెల్లిమర్ల రహదారి మీదుగా పాదయాత్ర సాగుతుందన్నారు. జరజాపుపేటలో పాదయాత్ర అనంతరం మధ్యాహ్నం 3గంటలకు మొయిద జంక్షన్లో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు రఘురాం చెప్పారు. 

Advertisement
Advertisement