సిద్ధప్ప కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ | Sakshi
Sakshi News home page

సిద్ధప్ప కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

Published Sun, Feb 22 2015 4:15 PM

ys jagan raithu bharosa yatra

అనంతపురం:వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. రైతు భరోసా యాత్రకు రైతులు, మహిళలు బ్రహ్మరథం పడుతున్నారు.  రైతు భరోసా యాత్రలో భాగంగా ఆదివారం మామిడి మాకులపల్లెకు చేరుకున్న జగన్ కు ఘన స్వాగతం లభించింది.  అనంతరం అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు సిద్ధప్ప కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఏ కష్టమొచ్చినా తాను అండగా ఉంటానని ఆయన వారికి భరోసా ఇచ్చారు.

 

 ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు.  బెంగళూరు నుంచి రోడ్డు మార్గం ద్వారా చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టు కు చేరుకున్న వైఎస్ జగన్కు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పూలతో స్వాగతం పలికారు.

Advertisement
Advertisement