నేడు విశాఖ జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమీక్ష | Sakshi
Sakshi News home page

నేడు విశాఖ జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమీక్ష

Published Fri, Nov 21 2014 8:33 AM

నేడు విశాఖ జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమీక్ష - Sakshi

హైదరాబాద్: చంద్రబాబు నాయుడు ప్రభుత్వ మోసపూరిత వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 5వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం విశాఖపట్నం జిల్లాకు చెందిన ఆ పార్టీ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

లోటస్పాండ్లోని వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అలాగే జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జగన్ జిల్లా నేతలతో ఈ సందర్భంగా చర్చించనున్నారు. కాగా ధర్నా అంశంపై వైఎస్ జగన్ ఇప్పటికే వివిధ జిల్లాలకు చెందిన నేతలు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 5వ తేదీన విశాఖ కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో వైఎస్ జగన్ పాల్గొనున్నారు.

Advertisement
Advertisement