జిల్లాలో రేపు వైఎస్‌ జగన్, విజయమ్మ పర్యటన | Sakshi
Sakshi News home page

జిల్లాలో రేపు వైఎస్‌ జగన్, విజయమ్మ పర్యటన

Published Thu, Mar 28 2019 8:56 AM

 YS Jagan, Vijayamma Election Campaign March 29th In Prakasam - Sakshi

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ శుక్రవారం జిల్లాలో పర్యటిస్తారని మాజీ మంత్రి ఆ పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగే ఎన్నికల ప్రచార సభల్లో వీరు పాల్గొంటారన్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు నియోజకవర్గ కేంద్రం సంతనూతలపాడులో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారన్నారు.

విజయమ్మ పర్యటన ఇలా...
వైఎస్‌ విజయమ్మ ఉదయం 10 గంటలకు కందుకూరు సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కనిగిరిలో జరిగే ఎన్నికల సభలో మాట్లాడతారు. సాయంత్రం 4 గంటలకు మార్కాపురంలో ప్రచార సభలో పాల్గొని రాత్రికి అక్కడే బస చేస్తారు. శనివారం ఉదయం యర్రగొండపాలెంలో ఉదయం 10 గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ పూర్తయిన తరువాత గుంటూరు జిల్లా మాచర్లకు బయలుదేరి వెళతారని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. 

Advertisement
Advertisement