సత్తెనపల్లిలో సంక్షేమ సవ్వడి
సత్తెనపల్లి: సత్తెనపల్లి మున్సిపాలిటీగా ఆవిర్భవించి 40 ఏళ్లు పూర్తయింది. తొలుత 17 వార్డులు, 30వేల జనాభాతో మూడో గ్రేడ్ మున్సిపాలిటీగా ప్రస్థానం మొదలైంది. ప్రస్తుతం 31 వార్డులతో 56,663 మంది జనాభాతో రెండో గ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయ్యింది. ఈ మున్సిపాలిటీకి ఇప్పటి వరకు నలుగురు చైర్మన్లు పాలించారు. వీరిలో వెలుగూరి విజయవెంకటలక్ష్మీనారాయణ, కొడాలి ఉమాదేవి, కొల్లిపర కాశీవిశ్వనాధం, గంటా సరస్వతి, యెల్లినేడి రామస్వామిలు పాలించారు. ముగ్గురు ఆర్యవైశ్యులు కాగా, ఒక్కరు బీసీ, ఒక్కరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. రెండో సారి పాలించే అవకాశం ఇప్పటి వరకు ఎవరికి రాలేదు. ప్రస్తుతం చల్లంచర్ల లక్ష్మీతులసీ మున్సిపల్ చైర్పర్సన్గా కొనసాగుతున్నారు. ఈమె ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన వారు.
పట్టణంలో రూ.367.96 కోట్లతో
సంక్షేమాభివృద్ధి
పట్టణంలో మునుపెన్నడూ లేని విధంగా రూ.367,96,82,268తో సంక్షేమాభివృద్ధి చేపట్టారు. 29 సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ కింద 67,876 మందికి రూ.216,77,69, 454 లబ్ధి చేకూరగా .. నాన్ డీబీటీ కింద 14,495 మందికి రూ.124,98,55,656 లబ్ధి చేకూరింది. డీబీటీ, నాన్డీబీటీ కింద 82,371 మందికి రూ.341,76,25,110 లబ్ధి చేకూరింది. ఇక అభివృద్ధి విషయానికి వస్తే రూ.262,05,7,158 ఖర్చు చేశారు. వీటిల్లో ప్రధానంగా విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చారు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. పట్టణంలో 30 ఏళ్లుగా పేరుకుపోయిన డంపింగ్ యార్డ్ల్లోని చెత్తా చెదారాన్ని శాసీ్త్రయ పద్ధతిలో తొలగించారు. ఏరియా వైద్యశాల అభివృద్ధితోపాటు రెండు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. నాడు–నేడు కింద పాఠశాలల రూపురేఖలు మార్చారు. మూడు వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ భవనాలను నిర్మించారు. మార్కెట్ యార్డ్ వద్ద అగ్రి టెస్టింగ్ ల్యాబ్ను నిర్మించారు. ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా 14వ వార్డులో రెండు మున్సిపల్ కాంప్లెక్స్లు నిర్మించారు. జల్లిపరిషత్ గెస్ట్హౌస్ చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టారు. ముస్లింలకు మసీదు స్ధలానికి ప్రత్యేకంగా హక్కులు కల్పించారు. చెక్పోస్ట్ వద్ద ముస్లింసోదరులకు గదుల నిర్మాణం చేపట్టారు. పట్టణంలో సీసీ రోడ్లు, డ్రెయిన్లు ... ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. నాడు–నేడు కింద పాఠశాలల అభివృద్ధి
అర్బన్ హెల్త్ సెంటర్లలో సకల సౌకర్యాలు