అవినీతి ఎక్కడున్నా ఏరివేయాలి | Sakshi
Sakshi News home page

అవినీతి ఎక్కడున్నా ఏరివేయాలి

Published Wed, Feb 26 2020 4:37 AM

YS Jaganmohan Reddy Comments On Eradication of Corruption - Sakshi

సాక్షి, అమరావతి: అవినీతి నిర్మూలన విషయంలో రాజీపడే సమస్యే లేదని, అవినీతి ఎక్కడున్నా ఏరివేయాల్సిందేనని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో అవినీతి నిరోధానికి ఏర్పాటు చేసిన 14400 టోల్‌ ఫ్రీ నంబర్‌పై ప్రచారానికి సంబంధించి బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు సందేశంతో రూపొందించిన ఇంగ్లిష్, తెలుగు భాషల్లోని వీడియోలను మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి విడుదల చేశారు. ‘అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్‌ మన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారి సంకల్పం.

ఎవ్వరైనా లంచం అడిగినా, అవినీతికి పాల్పడినా టోల్‌ ఫ్రీ నంబర్‌ 14400కు ఫిర్యాదు చేయండి. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి’ అని పీవీ సింధు ఈ వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించడంపై అధికారులు పూర్తి స్థాయిలో ధ్యాస పెట్టాలని సూచించారు. 

Advertisement
Advertisement