విశాఖ చేరుకున్న వైఎస్‌ జగన్‌ | Sakshi
Sakshi News home page

విశాఖ చేరుకున్న వైఎస్‌ జగన్‌

Published Mon, Jan 23 2017 11:20 AM

విశాఖ చేరుకున్న వైఎస్‌ జగన్‌ - Sakshi

విశాఖపట్నం : ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం విశాఖ చేరుకున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. విశాఖ నుంచి రోడ్డుమార్గం ద్వారా విజయనగరానికి బయల్దేరారు.

విజయనగరం జిల్లా రైలు ప్రమాదం జరిగిన కూనేరు ఘటనా స్థలాన్ని వైఎస్‌ జగన్‌ పరిశీలిస్తారు. క్షతగ్రాతులతో పాటు ప్రమాద ఘటనలో మరణించిన పాత్రబిల్లి శ్రీను, పోలిశెట్టి, మిరియాల కృష్ణ కుటుంబాలను ఆయన పరామర్శిస్తారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement