హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ సోమవారం పట్టిసీమ ప్రాజెక్ట్పై దద్దరిల్లింది. నదుల అనుసంధానం అంశం అసెంబ్లీలో తీవ్ర గందరగోళానికి దారితీసింది. దీనిపై చర్చించేందుకు దాదాపు రెండు గంటల సమయం ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేసింది. పట్టిసీమపై చర్చించడానికి తగిన సమయం ఇవ్వాలని ఆ పార్టీ కోరగా, 344 నిబంధన కింద అంత సమయం ఇవ్వలేమని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు.
ఎంతో కీలకమైన ఈ అంశంపై 20 నిమిషాల చర్చతో ముగించాలని ప్రభుత్వం భావిస్తోందని ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టమొచ్చిన కాంట్రాక్టర్కు ఎక్కువ రేటుకి టెండర్లు ఇచ్చారని, ఈ అంశాన్ని ప్రజల దృష్టికి తేవాలన్నారు. పట్టిసీమపై చర్చించడానికి కేవలం అరగంట సమయం మాత్రమే ఇస్తే ఒప్పుకోమని, సభను అడ్డుకుంటామని హెచ్చరించారు. ప్రతిపక్షం చెప్పే విషయాలను అధికార పక్షం వింటే.. సమస్య ఏంటో అర్థం అవుతుందని జగన్ అన్నారు. చర్చకు అనుమతిస్తూ.. సమయం అంతా అధికార పక్షానికి ఇచ్చి ప్రతిపక్షం నుంచి మాత్రం ఒక్కరే మాట్లాడేందుకు అవకాశం ఇస్తామనడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి యనమల రామకృష్ణుడు జోక్యం చేసుకుని.. చర్చకు వైఎస్ఆర్సీపీ వెనక్కి తగ్గుతోందన్నారు. యనమల వ్యాఖ్యలను వైఎస్ జగన్ ఖండిస్తూ 'ఎవరండి డిస్కషన్ వద్దంటుంది...మీరా నేనా' అంటూ ఓ వైపు సమయం కావాలంటే ఇవ్వకుండా, మరోవైపు ప్రభుత్వం ఎదురు దాడికి దిగటం సిగ్గుచేటన్నారు. ఈ నేపథ్యంలో అధికార, విపక్షం మధ్య వాగ్వాదం నెలకొనటంతో సభలో తీవ్ర గందరగోళం చోటుచేసుంది. దాంతో స్పీకర్ సభను పది నిమిషాలు వాయిదా వేశారు.
'ప్రతిపక్షం ఏం చెబుతుందో వినండి...'
Published Mon, Mar 16 2015 12:26 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement