సోమవారం గవర్నర్ను కలవనున్న వైఎస్ జగన్ | Sakshi
Sakshi News home page

సోమవారం గవర్నర్ను కలవనున్న వైఎస్ జగన్

Published Sat, Jul 5 2014 9:06 PM

సోమవారం గవర్నర్ను కలవనున్న వైఎస్ జగన్ - Sakshi

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం గవర్నర్ నరసింహన్ను కలవనున్నారు. వైఎస్ జగన్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గవర్నర్తో సమావేశం కానున్నారు.

ఆంధ్రప్రదేశ్ జెడ్సీ చైర్మన్ల ఎన్నికల సందర్భంగా టీడీపీ నాయకులు చేసిన దౌర్జన్యాల గురించి వైఎస్ జగన్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన జెడ్పీటీసీలను ప్రలోభ పెట్టడం, బెదిరించడం, ఎన్నికల సందర్భంగా టీడీపీ నాయకులు దాడులకు
పాల్పడటం వంటి సంఘటనలపై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement