మైలవరం : మండలంలోని తోలుకోడులో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు గురువారం దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దళితవాడలో స్థానిక వైఎస్ విగ్రహం వద్ద ఖాళీ స్థలంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసే విషయంలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. గ్రామానికి చెందిన పెండెం భాస్కరరావు స్థలంలో గోగులమూడి సుధాకర్ గతంలో దుకాణం పెట్టుకుంటానని చెప్పడంతో ఆ స్థలాన్ని ఖాళీ చేసి ఇచ్చాడు.
ఏడాదిగా అది మూసి ఉంది. గురువారం ఆ స్థలంలో కంకరవేసి చదును చేస్తున్న నేపథ్యంలో భాస్కరరావు కలుగజేసుకుని తన స్థలాన్ని తిరిగి ఇవ్వాల్సిందిగా సుధాకర్ను కోరాడు. ఇందుకు అతడు నిరాకరించాడు. దీంతో ఘర్షణ జరిగింది. సుధాకర్ తరఫున టీడీపీకి చెందిన కార్యకర్తలు భాస్కరరావుపై దాడి చేసి గాయపర్చారు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉన్న బాధితుడి కుమారుడు ఏం జరిగిందోనని సంఘటన స్థలానికి చేరుకోవడంతో అతడిపై, అడొచ్చిన కాలనీ వాసులపై కూడా దాడి చేశారు.
అంతటితో ఆగకుండా వైఎస్సార్సీపీ కార్యకర్తలైన పెండెం ప్రేమ్కుమార్, పెండెం భాస్కరరావు, పెండెం శరత్, బుర్రె రాంబాబు, పెండెం యాకోబు, రామల నాగరాజులను తీవ్రంగా గాయపర్చారు. వారిని మెలవరం ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో ఒక మహిళ కూడా గాయపడింది. టీడీపీ కార్యకర్తలు రౌడీల్లా ప్రవర్తిం చారని గ్రామానికి చెందిన పెండెం కనకరత్నం ఆవేదన వ్యక్తం చేసింది. ఆ సమయం లో మాజీ సర్పంచి, ప్రస్తుత వైస్ ఎంపీపీ శోభన్బాబు కూడా ఉన్నారని, దాడిని అడ్డుకోవాల్సిందిగా కోరానని అయితే ఆయన తనను పక్కకు నెట్టివేశారని ఆరోపించింది.
పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడంటూ వైఎస్సార్సీపీ గ్రామనేత బుర్రె ప్రతాప్ తెలిపారు. స్టేషన్లో తాము ఫిర్యాదు చేసినా తీసుకోవడం లేదని అదే టీడీపీ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్నారని బాధితులు పేర్కొన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని వెంకన్నబాబు, ఏఎంసీ మాజీ చైర్మన్ అప్పిడి సత్యనారాయణరెడ్డి, పార్టీ ప్రచార కార్యదర్శి జి.వి.ప్రసాద్ పరామర్శించారు.
వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి
Published Fri, Sep 5 2014 3:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement