వైఎస్సార్ సీపీ రాజధాని రైతు హక్కుల కమిటీ హెచ్చరిక
గ్రామాల్లో పర్యటించి రైతుల అభిప్రాయాలు తెలుసుకున్న నేతలు
తాడేపల్లి రూరల్ : రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో భూములు ఇవ్వాలంటూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని రాజధాని రైతులు, కౌలు రైతులు, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ పునరుద్ఘాటించింది. రాజధాని ప్రాంతంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన హక్కుల కమిటీ సభ్యులు శుక్రవారం ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఉండవల్లి రామాలయం వద్ద జరిగిన సమావేశంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ రాజధాని గ్రామాల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న తంతుపై వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి వద్ద పూర్తి సమాచారం ఉందనీ, తాము కూడా భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నామని చెప్పారు. విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయం వద్ద రైతులతో భారీ ధర్నా నిర్వహించేందుకు వ్యూహ రచన చేస్తున్నామని తెలిపారు. అనంతరం పెనుమాక రామాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత పార్థసారథి మాట్లాడుతూ రెండో పంటకు రుణాలు మంజూరు చేయవద్దని బ్యాంకర్లను కలెక్టర్ ఆదేశించడం న్యాయం కాదని మండిపడ్డారు.
రైతులు ధైర్యంగా రెండో పంట వేసుకోవచ్చని, అవసరమైతే న్యాయపోరాటానికి వైఎస్సార్ సీపీ ముందుంటుందని చెప్పారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు(నాని) మాట్లాడుతూ రైతుల భూములను సొమ్ము చేసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) మాట్లాడుతూ పెనుమాక, ఉండవల్లి, తాడేపల్లి ప్రాంత రైతులు, పేదల జీవితాలపై ప్రభుత్వం కక్ష కట్టిందని, బెదిరించైనా బలవంతంగా భూ సమీకరణకు పాల్పడుతుందని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, పార్టీ నేతలు మేరుగ నాగర్జున, దొంతిరెడ్డి వేమారెడ్డి, పాటిబండ్ల కృష్ణమూర్తి, బండారు సాయి బాబు, తాడేపల్లి మండల ఎంపీపీ కత్తిక రాజ్యలక్ష్మి, మున్సిపల్ చైర్ పర్సన్ కొయ్యగూర మహాలక్ష్మి పాల్గొన్నారు.
రైతుల జోలికి వస్తే సహించం
Published Sat, Feb 14 2015 1:11 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Abinaya: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన లక్నో
హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్..ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement