అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు

Published Mon, Jan 20 2014 8:42 AM

అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు - Sakshi

హైదరాబాద్ : శాసనసభలో విపక్షాలు సోమవారం వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. విభజన బిల్లుపై ఎమ్మెల్యేల అభిప్రాయాలు కోరుతూ వెంటనే ఓటింగ్ నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ సమైక్యాంధ్ర ఉద్యమాల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై టీడీపీ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లుపై రాష్ట్ర శాసనసభ అభిప్రాయాలు తెలియజేయటానికి రాష్ట్రపతి ఇచ్చిన గడువు మరో నాలుగు రోజులే మిగిలి ఉండటంతో.. దీనిపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చ ఎలా ముగుస్తుంది? ఏ మలుపు తిరుగుతుంది? అనే ఉత్కంఠ సీమాంధ్ర, తెలంగాణ నేతల్లో తీవ్రమౌతోంది.

Advertisement
Advertisement