గుర్ల, న్యూస్లైన్:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన కోసం రాష్ట్ర ప్రజలంతా నిరీక్షిస్తున్నారని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు అన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు ఖాయమని చెప్పారు. శనివారం గుర్ల మండలంలోని ఆనందపురంలో టీడీపీకి చెందిన పలు కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరారుు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు సక్రమంగా కొనసాగాలంటే జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయూలన్నారు. ఈ మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సైని కుల్లా పని చేయూలని పిలుపునిచ్చారు. పార్టీ చీపురుపల్లి నియోజక వర్గ సమన్వయకర్త మీసాల వరహాలనాయుడు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీకి ప్రజల్లో ఎనలేని ఆదరణ ఉందన్నారు. వచ్చే ఎన్ని కల్లో కాంగ్రెస్, టీడీపీలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని తెలిపారు. అనంతరం పార్టీలో చేరిన వారికి పెనుమత్స కండువాలు వేసి, పార్టీలోకి ఆహ్వానించారు. అంతకముందు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహిం చారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సింగుబాబు, పార్టీ నాయకులు పల్లి కృష్ణ, మంత్రి వెంకటరమణ, అంబల్ల అప్పలనాయుడు, శ్రీను రాజు, రైతు సంఘం అధ్యక్షుడు నీలకంఠంనాయుడు, న్యాయవాదులు మావూరి శంకరరావు, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.వైఎస్ హయూంలోనే గిరిజనాభివృద్ధి గుమ్మలక్ష్మీపురం: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయూం లోనే గిరిజనాభివృద్ధి జరిగిందని వైఎస్సార్ సీపీ కురుపాం నియోజకవర్గ సమన్వయకర్త శత్రుచర్ల చంద్రశేఖరరాజు అన్నారు. శనివారం లుంబేసు, గౌడుగూడ, లప్పటి గ్రామాలకు చెందిన వంద కుటుంబాలు వైఎస్సా ర్ సీపీలో చేరారుు. ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ మహానేత వైఎస్సార్ గిరిజనుల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేశారన్నారు. కానీ ప్రస్తుత కాం గ్రెస్ ప్రభుత్వం ఆ పథకాలను నిర్వీర్యం చేస్త్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పాల కులు గిరిజనుల సమస్యలను పూర్తిగా గాలికి వదిలేశారన్నారు. ఇప్పటికీ చాలా గిరిజన గ్రామాల్లో కనీ స సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశా రు. వైఎస్ హయూం నాటికి స్వర్ణయుగాన్ని మళ్లీ చూడాలంటే వైఎస్సార్ సీపీ అధ్యక్షు డు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయూలని పిలుపునిచ్చారు.
అనంతరం లక్ష్మీ మహిళా సంఘం, మజ్జిగౌరి, సరస్వతి, ముత్యాలమ్మ,సాయిరాం మహిళా సంఘాలకు చెందిన మండంగి పారమ్మ, కంసాలమ్మ, తారమ్మ, సుకుమారి, పత్తిక సాయి, పార్వతి, జగదీశ్వరి, నూకాలమ్మ, తదితరులతో పాటు లుంబేసు, లప్పటి, వత్తా డ గ్రామపెద్దలు, మాజీ సర్పంచ్ కె. సోమయ్య, అప్పారావు, సూరయ్య పార్టీలో చేరారు. వారికి నాయకులు కండువాలు వేసి, పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మండల కన్వీన ర్ తోయక గోపాల్ ఆధ్వర్యంలో లుంబేసులో గడపగడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమంలో చినమేరంగి సర్పంచ్ శత్రుచర్ల పరీక్షిత్రాజు, యు వజన సంఘం నాయకులు నిమ్మక కొండలరావు, హరినాథ్, సింహాచలం, కడ్రక తవిటయ్య, సోమయ్య పాల్గొన్నారు.