Sakshi News home page

రుణమాఫీ చేసిన ఘనత వైఎస్‌దే

Published Tue, May 26 2015 2:47 AM

YSR credited for loan waiver

కడప అగ్రికల్చర్ : రుణమాఫీ చేసిన ఘనత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికే సాధ్యమైందని మాజీ మంత్రి అహ్మదుల్లా కొనియాడారు. సోమవారం కడపలోని ఇందిరాభవన్‌లో నిర్వహించిన సిటీ కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ పాదయాత్రలో రైతుల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం ఏర్పడగానే  రైతుల రుణమాఫీకి తొలి సంతకం చేసి చూపించారని కొనియాడారు.
 
 టీడీపీ ఎన్నికల ప్రచారంలోను, మేనిఫెస్టోలోను రైతుల, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పారని, చంద్రబాబునాయుడు సీఎం అయ్యాక వాగ్దానాలు మరచి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఏడాది గడుస్తున్నా పూర్తిస్థాయిలో ఏ రైతుకు, ఏ డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయలేదని దుయ్యబట్టారు. ఇదేనా మీ రుణమాఫీ అని ప్రశ్నించారు. సింగపూర్, చైనా, జపాన్‌లకు పోతే పెట్టుబడులు రావని, రాష్ట్రంలో తగిన వనరులు క ల్పిస్తే పెట్టుబడిదారులు క్యూ కడతారని   హితవు పలికారు.

Advertisement

What’s your opinion

Advertisement