అలుపెరగని పోరాటం చేస్తాం : వైఎస్ జగన్ | Sakshi
Sakshi News home page

అలుపెరగని పోరాటం చేస్తాం : వైఎస్ జగన్

Published Thu, Mar 12 2015 5:39 PM

అలుపెరగని పోరాటం చేస్తాం : వైఎస్ జగన్ - Sakshi

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల పరిష్కారానికి అలుపెరుగని పోరాటం చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. నేడు వైఎస్ఆర్ సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన గురువారం ఉదయం లోటస్ పాండ్లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ పార్టీ పెట్టినప్పటి నుంచి అభివృద్ధి చెందుతూనే ఉందన్నారు.

పార్టీ పెట్టినప్పుడు తమకు ఎలాంటి అసెంబ్లీ స్థానాలు లేవని ఆ తర్వాత రెండు స్థానాలు.. అని అక్కడ నుంచి పార్టీ ప్రస్థానం మొదలు పెడితే ... పార్టీ ఆవిర్భవించిన అనతి కాలంలోనే ప్రజల ఆదరణ పొందిందన్నారు. పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని వైఎస్ జగన్ తెలిపారు.  

 

Advertisement
Advertisement