సాక్షి, హైదరాబాద్: నంద్యాల ఉప ఎన్నికలో అధికార తెలుగుదేశం పార్టీ అన్ని రకాల ప్రలోభాలకు పాల్పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నంద్యాల రోడ్డు షోలో టీడీపీ అభ్యర్థికి ఓటువేయాలంటూ వంద రూపాయల నోట్లను పంపిణీ చేయడం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయని నంద్యాల వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డి తరఫున పార్టీ ప్రధాన కార్యదర్శి శివకుమార్ హైదరాబాద్లో ఈసీ దృష్టికి తీసుకువచ్చారు.
ఇందుకు సంబంధించిన ఆధారాలను కమిషన్కు సమర్పించారు. నంద్యాలలో టీడీపీ నేతలు విచ్చలవిడివిగా డబ్బు పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తమ పార్టీకి మద్దతివ్వకపోతే స్వయం సహాయక సంఘాలకు రావాల్సిన ప్రయోజనాలు నిలిపివేస్తామని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని కూడా ఈసీకి ఫిర్యాదు చేశారు.