జగ్గయ్యపేట అర్బన్, న్యూస్లైన్ : ఇటీవల జరిగిన మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసి ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్ సీపీకే బ్రహ్మరథం పట్టారని, రానున్న ఎన్నికల్లోనూ ఇదే పునరావృతమవుతుందని ఆ పార్టీ సీనియర్ నేత సామినేని విశ్వనాథం స్పష్టం చేశారు.
సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మే నెలలో వెలువడనున్న ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులను నిశ్చేష్టులను చేస్తూ అవాక్కయ్యే విధంగా ఫలితాలు రాబోతున్నాయన్నారు.గ్రామాల్లో ఎక్కువ శాతం పోలైన ఓట్ల సరళిని బట్టి ప్రజలు పెద్ద ఎత్తున వైఎస్సార్ సీపీకి ఓట్లు వేశారని స్పష్టమవుతుందన్నారు.
నియోజకవర్గంలో ఉన్న మొత్తం 60 ఎంపీటీసీ స్థానాల్లో 40 పైచిలుకు స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు విజయఢంకా మోగిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అలాగే మూడు ఎంపీపీలు, జెడ్పీటీసీలు కైవసం చేసుకుంటామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 27 వార్డులకు గానూ 20కు పైగా వార్డుల్లో తమ పార్టీ అభ్యర్థులు విజయవిహారం చేస్తారని చెప్పారు.
పార్జీ జిల్లా అధికార ప్రతినిధి తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల ఫలితాల్లో తమ పార్టీ ఆధిక్యత సాధిస్తుందని స్పష్టంగా కనపడుతుందన్నారు. రేపటి అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్స్గా ఉన్న ఈ ఎన్నికల ఓటింగ్ సరళి వలన పార్టీ శ్రేణులు రెట్టించిన సమరోత్సాహంతో ఉదయభానును అఖండమెజార్టీతో గెలిపించటానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్యాల చలం మాట్లాడుతూ రాష్ట్రాన్ని నిలువునా చీల్చిన కాంగ్రెస్, తెలుగుదేశం, బీజే పీలు రాష్ట్ర చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారని వాళ్లకు బుద్ధిచె ప్పటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
పార్టీ పట్టణ కన్వీనర్ మదార్సాహెబ్ మాట్లాడుతూ చంద్రబాబు బీజే పీతో పొత్తుపెట్టుకుని తన నెత్తిన తానే నిప్పులు పోసుకుంటున్నాడని, ముస్లింలకు మరలా అన్యాయం చేయనని, బీజేపీతో పొత్తుపెట్టుకోనని ప్రగల్భాలు పలికి... నేడు మాట మార్చిన పచ్చి అవకాశవాదని, అయనకు వచ్చే ఎన్నికల్లో ముస్లింలు తగిన మర్యాద చేసేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు చింకావీరంజనేయులు, జె. ఉదయబాస్కర్, నంబూరి రవి, మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్, కొలగాని వెంకయ్య, పొన్నా రామ్మోహన్, పట్టణ యూత్కన్వీనర్ రాంబాబు, సీనియర్ నాయకులు గంటా హనుమంతరావు, తుమ్మేపల్లి గోపాలరావు, మాదిరాజు కేశవరావు, మైనార్టీ నాయకులు అమీర్భీ, ఖాజామొహిద్దీన్, జాన్బాషా పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీకే బ్రహ్మరథం
Published Tue, Apr 8 2014 2:37 AM
Advertisement
Advertisement
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
సూర్యప్రభ వాహనంపై గోవిందుడు
బడి బస్.. ఫిట్నెస్
పది సప్లిమెంటరీ పరీక్షకు 1073 మంది హాజరు
కౌంటింగ్కు పటిష్టంగా భద్రత
No Headline
ఇంటర్ మ్యాథ్స్–బి, హిస్టరీ పరీక్షలు ప్రశాంతం
అవాంఛనీయ సంఘటనలకు తావివ్వొద్దు
తత్కాల్ ఫార్మ్స్పై నంబర్లు వేసి ఇవ్వాలి
రోడ్డు ప్రమాదంలో సిరికల్చర్ ఉద్యోగి మృతి
ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ
తప్పక చదవండి
- ఓటీటీలో మలయాళ హిట్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
- జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్రకు ప్రత్యేక రైలు
- ప్రపంచ క్రికెట్లో ఇద్దరే ఇద్దరు..!
- ఇప్పట్లో ‘స్థానిక’ ఎన్నికలు లేనట్టేనా?
- Kartikeya Gummakonda: ప్రేక్షకులు అప్పుడే హీరోలా చూస్తారు
- ఊపు తగ్గిన యూపీ ఎన్నికలు
- ప్రాణాలు తీస్తున్న గజరాజులు
- లయ తప్పుతున్న గుండె
- ‘స్కూటీ’అంటే పాప.. ‘బైక్’అంటే బాబు
- Lok Sabha Election 2024: ఒడిశాలో రసవత్తర పోటీ
Advertisement