రాష్ట్రాన్ని బాబు భ్రష్టు పట్టిస్తున్నారు | Sakshi
Sakshi News home page

రాష్ట్రాన్ని బాబు భ్రష్టు పట్టిస్తున్నారు

Published Mon, Dec 31 2018 10:39 AM

YSRCP Leader Akepati Amarnath Reddy fire On babu - Sakshi

రాజంపేట రూరల్‌ : అధికారంలోకి వచ్చినప్పటినుంచి అన్ని రంగాల్లో విఫలమైన చంద్రబాబు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం శింగనవారిపల్లి శ్రీమారమ్మ ఆలయంలో ఆకేపాటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ నాయకుడు సి. చలమయ్య నివాసంలో నిర్వహించిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఆకేపాటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకేపాటి విలేకర్లతో మాట్లాడారు. 

దేశంలో అందరికంటే సీనీయర్‌ని అని, సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకొనే బాబుకు రాష్ట్రాభివృద్ధిపై చిత్తశుద్ధిలేదని ఎద్దేవా చేశారు. 2018 సంవత్సరం చివరికల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తానని కల్లబొల్లి హామీలిచ్చారని.. ఇప్పుడు ప్రజలకు ఏమి సమాధానం చెబుతావని ప్రశ్నించారు. బాబు పాలనపై అన్నివర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోయాయని ఆరోపించారు. అన్నదాతల ఆత్మహత్యలను అరికట్టడంలో బాబు ప్రభుత్వం విఫలం అయ్యిందని విమర్శించారు. నిరుద్యోగులకు మొండి చేయి చూపిచిన ఘనత బాబుకే దక్కుతుందన్నారు. 

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వైద్యం కోసం ప్రవేశ పెట్టిన పథకాలను నిర్వీర్యం చేసిన బాబు ఎంతో మంది ప్రాణాలను బలిగొన్నారన్నారని ఆరోపించారు.  రాజన్న రాజ్యం రావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందలన్నా జగనన్న ముఖ్యమంత్రి కావాలన్నారు. ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి మనందరి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ నాయకులు బొల్లినేని రామ్మోహన్‌నాయుడు, సి. నాగేశ్వరచౌదరి, బుర్రు. నాగేశ్వరరావు, ఎం.లక్ష్మీనారాయణ, కె.శంకరయ్యనాయుడు, దాసరి పెంచలయ్య, కె.మణినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement