వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం నేత వరద సాయం | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం నేత వరద సాయం

Published Tue, Oct 29 2013 1:01 AM

ysrcp leader donates Rs. 2lakhs for flood victims

 సీఎం నిధికి జగన్ చేతుల మీదుగా రూ. 2 లక్షల చెక్కు అందజేత
 సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద పోటెత్తి ఇక్కట్ల పాలైన బాధితులకు సాయం చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం నేత పైడి రాజారావు ముందుకు వచ్చారు. రూ. 2 లక్షల చెక్కును పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా సీఎం సహాయనిధికి సోమవారం విరాళంగా పంపారు. కాగా, సదరు చెక్కును నిబంధనల ప్రకారం సీఎం నిధికి పంపాలని పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బందిని జగన్ ఆదేశించారు. అదేవిధంగా రాజారావును పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బొడ్డేపల్లి పద్మజ అభినందించారు.

Advertisement
Advertisement