ఆంధ్ర శశికళ.. లోకేష్‌ | Sakshi
Sakshi News home page

ఆంధ్ర శశికళ.. లోకేష్‌

Published Fri, Feb 17 2017 12:59 PM

ఆంధ్ర శశికళ.. లోకేష్‌ - Sakshi

విజయవాడ: ఆంధ్ర జయలలిత అంటే చంద్రబాబు నాయుడు అని, ఆంధ్ర శశికళ అంటే ఆయన కొడుకు లోకేష్‌ అని వైఎస్ఆర్ సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతిలో కూరుకుపోయిన టీడీపీ నేతలు ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు రాజకీయాల్లోకి రాకముందు ఆయనకు ఆస్తి ఎంత ఉందని, రెండు ఎకరాలున్న ఆయన 2 లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, ఏపీని అవినీతి రాష్ట్రంగా మార్చారని వెల్లంపల్లి ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన చంద్రబాబా.. వైఎస్ జగన్‌ను విమర్శించేది అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసుకు భయపడే ప్రత్యేక హోదా అంశాన్ని పక్కనబెట్టారని విమర్శించారు. మామకు వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడు ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని అన్నారు. గుంటూరులో జరిగిన యువభేరిలో పిల్లలు అడిగిన ప్రశ్నలకు కూడా చంద్రబాబు సమాధానం చెప్పలేరని అన్నారు. చంద్రబాబుకు దమ్మూ, ధైర్యం ఉంటే పార్టీలోకి అనైతికంగా చేర్చుకున్న 21 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు. వైఎస్ జగన్‌పై లేనిపోని తప్పుడు ఆరోపణలు చేయడం మానుకుని, ఎన్నికల హామీలను నిలబెట్టుకుని రాష్ట్రాభివృద్దికి కృషి చేయాలని వెల్లంపల్లి హితవు పలికారు.

Advertisement
Advertisement