‘పుల్లారావు అక్రమాలను ఎండగడతాం’ | Sakshi
Sakshi News home page

‘పుల్లారావు అక్రమాలను ఎండగడతాం’

Published Sun, Jan 29 2017 2:11 PM

ysrcp leaders visit yedavalli in guntur district

గుంటూరు: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అక్రమాలను ఎండగడతామని వైఎస్సార్ సీపీ నాయకులు ప్రకటించారు. గుంటూరు జిల్లా చిలకలూరి పేట మండలం యడవల్లిలో వైఎస్సార్ సీపీ నేతలు ఆదివారం పర్యటించారు. 416 ఎకరాల సొసైటీ భూములను మంత్రి పుల్లారావు అనుచరులు కబ్జాకు ప్రయత్నించారని ఆరోపణలు రావడంతో వాస్తవాలు తెలుసుకునేందుకు వెళ్లారు.

బాధిత దళితులకు అండగా ఉంటామని భరోసాయిచ్చారు. గజం భూమి లాక్కున్నా సహించేది లేదని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ నాయకులు మర్రి రాజశేఖర్, అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు ముస్తఫా, పిన్నేల్లి రామకృష్ణారెడ్డి, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు యడవల్లిలో పర్యటించారు.

Advertisement
Advertisement