విజయ స్థూపాన్ని సందర్శించిన వైఎస్సార్‌సీపీ నేతలు | Sakshi
Sakshi News home page

విజయ స్థూపాన్ని సందర్శించిన వైఎస్సార్‌సీపీ నేతలు

Published Sun, Jan 6 2019 3:01 AM

Ysrcp leaders visited Pylon - Sakshi

ఇచ్ఛాపురం రూరల్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి వద్ద ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విజయ స్థూపం(పైలాన్‌)ను ఆ పార్టీ రాష్ట్ర నేతలు శనివారం సందర్శించారు. ఉదయం.. పార్టీ రీజనల్‌ కో–ఆర్డినేటర్, జిల్లా ఇన్‌చార్జి భూమన కరుణాకరరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, సాయంత్రం.. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, జిల్లా పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ కె.రామచంద్రమూర్తి, సీనియర్‌ జర్నలిస్ట్‌ దేవులపల్లి అమర్‌లు వేర్వేరుగా స్థూపాన్ని సందర్శించారు.

అనంతరం వైఎస్సార్‌ పాదయాత్ర ముగింపునకు గుర్తుగా ఏర్పాటు చేసిన విజయ ప్రస్థానం, షర్మిల పాదయాత్ర ముగింపునకు గుర్తుగా నిర్మించిన మరో ప్రస్థానం స్థూపాలను సందర్శించడంతో పాటు వైఎస్‌ జగన్‌ నిర్వహించనున్న బహిరంగ సభ ప్రదేశాన్ని పరిశీలించారు. వారి వెంట పార్టీ నేతలు కాయల వెంటకరెడ్డి, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి ఉన్నారు.  

Advertisement
Advertisement