'కాంగ్రెస్, టీడీపీ విభజన ద్రోహులు' | Sakshi
Sakshi News home page

'కాంగ్రెస్, టీడీపీ విభజన ద్రోహులు'

Published Mon, Jan 27 2014 6:10 PM

YSRCP MLA Bhumana Karunakar Reddy takes on congress, TDP leaders

హైదరాబాద్: రాష్ట్ర విభజనకు తాము సహకరిస్తున్నామంటూ టీడీపీ నేతలు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు విభజన ద్రోహులని ఆరోపించారు. సమైక్యాంధ్రను కోరుకుంటున్నది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ప్రజలు భావిస్తున్నారని భూమన అన్నారు.

చంద్రబాబు నాయుడి నోట ఇప్పటిదాకా సమైక్యమన్న మాటే రాలేదని విమర్శించారు. శాసనసభలో టీడీపీ నేతలు విభజనకు అనుకూలం, వ్యతిరేకమంటూ రెండు రకాలుగా మాట్లాడుతున్నారని భూమన అన్నారు. ఇలా రెండు మాటలు మాట్లాడే వారు సమైక్యవాదులా అంటూ టీడీపీ నాయకుల్ని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చారని భూమన ఆరోపించారు. కిరణ్ విభజనకు పూర్తిగా అనుకూలంగా ఉన్నారని చెప్పారు. సమైక్యం కోసం పోరాడుతున్న వారిపై విభజనవాదులనే ముద్ర వేస్తున్నారని వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement