తిరుపతి: పెండింగ్లో వున్న కోట్ల రూపాయల బకాయిలను రైతులకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ, తిరుపతిలోని గాజులమండెం షుగర్ ఫ్యాక్టరీ వద్ద వైఎస్ఆర్ సిపి నేతలు సోమవారం మహాధర్నాకు దిగారు. ధర్నాలో పాల్గొన్న నగరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ను సింగపూర్ చేస్తా..సింగపూర్ చేస్తానంటూ...ఊదరగొడుతున్నారని, సింగపూర్లో వ్యవసాయం అనేది లేదని...ఏపీలో కూడా వ్యవసాయం లేకుండా చేయాలన్నదే ఆయన ముఖ్య ఉద్దేశ్యంగా కనిపిస్తుందన్నారు.
మొక్కలోనే వ్యవసాయాన్ని తుంచేయాలనే చందంగా షుగర్ ఫ్యాక్టరీ బకాయిలను ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు వ్యవహరించటం దారుణమన్నారు. పంట భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేవారి పరం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని రోజా మండిపడ్డారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు షుగర్ ఫ్యాక్టరీలను ప్రయివేట్ వ్యక్తుల పరం చేశారని ఆమె ఆరోపించారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాగానే షుగర్ ఫ్యాక్టరీ బకాయిల నిమిత్తం రూ.300 కోట్లు విడుదల చేశారని రోజా ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైతులకు నేను ఉన్నానంటూ వైఎస్ ధైర్యాన్ని ఇచ్చారన్నారు. అలాంటిది చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు వ్యవసాయాన్ని పండుగ చేస్తాను, రుణమాఫీ అంటూ రైతులను అబద్దాల హామీలతో మోసం చేశారన్నారు. రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలభిస్తున్నారని రోజా మండిపడ్డారు. రైతుల నుంచి చెరుకును.. టన్నుకు మూడు వేల చొప్పుల చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు.
బాబు..వ్యవసాయం లేని సింగపూర్ చేస్తారా?
Published Mon, Dec 1 2014 12:16 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
95 నిమిషాల పాటు సీఎం రోడ్షో, కార్నర్ మీటింగ్
రూరల్ యాక్షన్కి సై
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు
ఈవీఎంల సెకండ్ ర్యాండమైజేషన్ పూర్తి
‘ఉపాధి’ కూలీలకు వసతులు కల్పించాలి
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
ప్రథమ చికిత్స కేంద్రం సీజ్
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement