హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గురువారం గృహ నిర్మాణంపై తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీరుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యపై సంబంధిత మంత్రిని మాట్లాడనివ్వకుండా ప్రతి విషయంలోనూ ఆయన జోక్యం చేసుకుంటున్నారని విమర్శించారు. ఎవరికీ బుర్ర లేదన్నట్లు ప్రతిదానికి అచ్చెన్నాయుడు లేస్తున్నారు.
నోరు ఉంది కదా అని ఆయనకు మైక్ ఇస్తున్నారా అని రోజా ప్రశ్నించారు. తల్లి కాంగ్రెస్...పిల్ల కాంగ్రెస్ అని ఆరోపించేముందు చంద్రబాబు నాయుడు అమ్మమ్మ కాంగ్రెస్ నుంచి వచ్చిన విషయాన్ని మరచిపోయారా అని ఆమె ఎద్దేవా చేశారు. కార్ల అద్దాలు తెరుచుకుని వెళితే ప్రజల బాధలు ఏంటో తెలుస్తాయన్నారు. గతంలో పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించకుండా పేదవారి జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు.
కాగా ఇళ్ల పేరుతో గతంలో దోపిడీ జరిగిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. గతంలో జరిగిన అక్రమాల వల్లే ఇప్పుడు ఇళ్లను కేటాయించలేకపోతున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఆ అవకతవకలపై విచారణ జరిపి ఈ ఏడాది కొత్త ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ప్రతిపక్షాలు సిద్ధంగా ఉంటే హౌస్ కమిటీ వేసి గతంలో ఇళ్ల అవకతవకలపై చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వంలో చాలా అవక తవకలు జరిగాయని అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై సర్వేపల్లి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ హయాం గురించి మాట్లాడే అర్హత ప్రస్తుత ప్రభుత్వానికి లేదని అన్నారు.
నోరుంది కదా అని మైక్ ఇస్తున్నారా?
Published Thu, Mar 12 2015 10:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆదివాసీల హక్కుల జోలికొస్తే ఊరుకోం
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
గర్భిణులూ జెర జాగ్రత్త..
న్యూస్రీల్
వడగండ్ల వాన
‘బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి’
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
ఉద్యోగాలిప్పిస్తానని ఘరానా మోసం
ఎన్నికల వేళ డేగకళ్ల నిఘా
నాంచారమ్మ జాతర విజయవంతం చేయండి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement