Sakshi News home page

చంద్రబాబు తీరు ఇంకా మారలేదు

Published Tue, Jul 16 2019 7:27 PM

YSRCP MLA's Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి : కాపులపై కపటనాటకాలు ఆడిన చంద్రబాబుకు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని, అయినా ఆయన తీరుమారలేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, జక్కంపూడి రాజాలు ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై తీవ్రంగా మండిపడ్డారు. కాపులకు చంద్రబాబు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. అందుకే కాపులు చంద్రబాబుకు బుద్ది చేప్పారని ఎద్దేవా చేశారు. కాపుల రిజర్వేషన్‌పై ఏర్పాటుచేసిన జస్టిస్‌ మంజునాథ్‌ కమిటీ తన సంతకం లేకుండానే నివేదిక సమర్పించినా.. దానిని అప్పటీ సీఎం చంద్రబాబు ఆమోదించారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క కాపు సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని నమ్ముతున్నారని, ఆయన కాపులకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటారని స్పష్టం చేశారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement