ఒంగోలు మున్సిపల్ కార్మికుల ధర్నాలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి | Sakshi
Sakshi News home page

ఒంగోలు మున్సిపల్ కార్మికుల ధర్నాలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

Published Sat, Jul 25 2015 3:13 PM

ఒంగోలు మున్సిపల్ కార్మికుల ధర్నాలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి - Sakshi

ఒంగోలు (ప్రకాశంజిల్లా) : తమ సమస్యలను పరిష్కరించాలని 16రోజులుగా ఆందోళన చేస్తున్న కార్మికులకు వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తన మద్దతు తెలిపారు. శనివారం కార్మికులు దీక్ష చేస్తున్న శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికుల న్యాయమైన కోర్కెలు తీర్చడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఉద్యమాన్ని అణగదొక్కాలని ప్రయత్నిస్తోందని అన్నారు. వారి సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే కార్మికులతో కలిసి ప్రభుత్వ పాలనను స్తంభింపజేస్తామని ఆయన హెచ్చరించారు.

Advertisement
Advertisement