పోలవరం రూరల్ : ప్రజల కష్టాలను తెలుసుకుని వారికి అండగా నిలుద్దామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యకర్తల అభిప్రాయాలను గౌరవిస్తానని, వారికి అనుగుణంగా నడుస్తానని చెప్పారు. పోలవరం మండల నాయకులు, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం పట్టిసం శివక్షేత్రం రేవులో మండల కన్వీనర్ సుంకర వెంకటరెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన నాయకులు, కార్యకర్తలు, అభిమానుల అభిప్రాయాలను, సమస్యలను తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరు అభిప్రాయాన్ని నిర్భయంగా తెలియజేయాలని కోరారు.
అనంతరం నాని మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. మండలస్థాయి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం పోలవరం మండలం నుంచే నాంది పలుకుతానని చెప్పారు. ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. సమావేశంలో రాష్ట్ర ఎస్టీ సెల్ కన్వీనర్ తెల్లం బాలరాజు మాట్లాడుతూ చంద్రబాబు బూటకపు హామీలతో ప్రజలను మోసం చేశారన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాలేదని కార్యకర్తలు బాధపడాల్సిన అవసరం లేదని, భవిష్యత్ అంతా వైఎస్సార్ సీపీదేనని చెప్పారు.
చంద్రబాబు మోసాన్ని ప్రజలు ఇప్పటికే గ్రహించారని చెప్పారు. ప్రతి మండలంలో పర్యటించి కార్యకర్తలు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారన్నారు. పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు చల్లా ఆనంద్ ప్రకాష్, అధికార ప్రతినిధులు పోల్నాటి బాబ్జీ, ముప్పిడి సంపత్కుమార్, జిల్లా మహిళా అధ్యక్షురాలు వందనపు సాయిబాలపద్మ, మైగాపుల దుర్గాప్రసాద్, మొగళ్ల హరిబాబు, జెడ్పీటీసీ సభ్యులు ఆకుల సత్యనారాయణ, పిల్లంగోరు దుర్గ, సర్పంచ్ మిడియం గంగాదేవి, బుగ్గా మురళి, సున్నం రాంబాబు, ఉలవల సత్యనారాయణ మూర్తి, తైలం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు అండగా నిలుద్దాం
Published Tue, Nov 18 2014 1:01 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
Advertisement