సాక్షి, హైదరాబాద్ : ప్రతిపక్ష నేత.. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన హత్యయత్నం కేసు దర్యాప్తు బాధ్యతలను స్వతంత్ర సంస్థకు అప్పగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఈ మేరకు జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. విమానాశ్రయంలో భద్రతా లోపాలవల్లే జగన్పై హత్యాయత్నం జరిగిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిల్ మంగళవారం ధర్మాసనం ముందు విచారణకు రానున్న నేపథ్యంలో, స్వతంత్ర సంస్థ దర్యాప్తు కోసం తన ముందు దాఖలైన వ్యాజ్యంపై బుధవారం విచారణ జరుపుతానని జడ్జి తెలిపారు.
జగన్పై జరిగిన హత్యాయత్నానికి సంబంధించి ఏపీ పోలీసులు సక్రమంగా దర్యాప్తు చేయడంలేదని, అందువల్ల దర్యాప్తు బాధ్యతలను స్వతంత్ర సంస్థకు అప్పగించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ తరఫున ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ ఏ.వి.శేషసాయి విచారణ జరిపారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి వాదనలు వినిపిస్తూ, జగన్పై హత్యాయత్నం జరిగిందని, అయితే ఈ ఘటనపై దర్యాప్తు సరైన రీతిలో సాగడంలేదన్నారు. హత్యాయత్నం జరిగిన వెంటనే నిందితుడు పబ్లిసిటీ కోసం చేశారంటూ డీజీపీ ప్రకటించారన్నారు. అయితే, రిమాండ్ రిపోర్టులో హత్యాయత్నం జరిగినట్లు పోలీసులు స్పష్టంగా పేర్కొన్నారని వివరించారు. దీనిపై మీరేమంటారని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది డి.రమేశ్ను న్యాయమూర్తి ప్రశ్నించారు.
అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హతే లేదని.. కేసును మంగళవారానికి వాయిదా వేస్తే అందుకు సంబంధించిన తీర్పులన్నింటినీ కోర్టు ముందుంచుతానని తెలిపారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ, వచ్చే సోమవారానికి వాయిదా వేస్తానని, ఆ రోజు తుది విచారణ జరుపుతానని చెప్పారు. ఈ సమయంలో నిరంజన్రెడ్డి స్పందిస్తూ, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, అందువల్ల అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ, దర్యాప్తు చేస్తుంటే మంచిదే కదా.. అత్యవసరం ఏముందన్నారు. స్వతంత్ర దర్యాప్తు విషయంపై ఉన్నతాధికారులను ఎవరైనా ఆశ్రయించారా? అని ఆరా తీశారు. ఘటన జరిగిన వెంటనే డీజీపీ హత్యాయత్నం ఘటనను పబ్లిసిటీ స్టంట్గా తేల్చేశారని, మరి అలాంటప్పుడు తాము ఎవరిని కలిసి ఏం ప్రయోజనమని నిరంజన్రెడ్డి అన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి.. ఇదే అంశంపై పిల్ దాఖలైనట్లు ఉంది కదా అని అడగ్గా, ప్రభుత్వ న్యాయవాది రమేశ్ అవునని చెప్పారు. అయితే ఈ వ్యాజ్యాన్నీ పిల్కు జత చేస్తానని న్యాయమూర్తి ప్రతిపాదించారు. పిల్తో జత చేయవద్దని, మంగళవారం పిల్ విచారణకు వచ్చే అవకాశం ఉందని, దానిపై ధర్మాసనం స్పందనను బట్టి ఈ వ్యాజ్యంపై బుధవారం విచారణ జరపొచ్చని నిరంజన్రెడ్డి సూచించారు. ఇది మంచి ప్రతిపాదన అంటూ జడ్జి విచారణను బుధవారానికి వాయిదా వేశారు.
జగన్పై హత్యాయత్నం కేసు రేపటికి వాయిదా
Published Tue, Oct 30 2018 5:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement