న్యూఢిల్లీ: డీజిల్ వాహనాలతో ముంచుకొస్తున్న ముప్పును నివారించేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. డీజిల్ ఉద్గారాలు మోగిస్తున్న డేంజర్ బెల్స్ పై పర్యావరణ కాలుష్య నియంత్రణ అథారిటీ (ఈపీసీఎ) అప్రమత్తమైంది. ఈ క్రమంలో డీజిల్ వాహనాలపై 30 శాతం గ్రీన్ టాక్స్ విధించే ప్రతిపాదనను సుప్రీంకోర్టుముందు ఉంచనుంది. డీజిల్ వాహనాలను నియంత్రించే లక్ష్యంతో సుప్రీం కోర్టు లో ఏప్రిల్ 30 న ఒక రోజంతా విచారణ సాగనుంది. ఈ నేపథ్యంలోనే ఈపీసీఎ ఈ తాజా ప్రతిపాదను చేయనున్నట్టు సమాచారం.
సెంటర్ ఫర్ సైన్స్అండ్ ఎన్వైరాన్ మెంట్ సెంటర్ ( సీఎస్ సీ) మంగళవారం డీజిల్ ఉద్గార సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఈ సూచన చేసింది. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ క్లీన్ ట్రాన్స్ పోర్టేషన్ ప్రతినిధి రే మింజారేస్ 'డీజిల్ ఉద్గారాలు- తీవ్రమైన ఆరోగ్య ప్రభావాలు' అనే అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా డీజల్ యొక్క ఆరోగ్య ప్రభావాలపై కెనడా ప్రభుత్వం ఈ ఏడాది విడుదల చేసిన నివేదిక సహా మూడు నివేదికలను వివరించారు. డీజల్ కారణంగా ఊపిరితిత్తుల క్యాన్సర్, తీవ్ర శ్వాసకోశ సమస్యలు, హృద్రోగ సమ్యలతో పాటుగా రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని నివేదించారు. ఈ సమస్యపై కెనడా, అమెరికా ప్రభుత్వాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాని తెలిపారు. ఈ రిపోర్టును సుప్రీం ముందుంచాలని ఆయన సూచించారు.
మార్చి 2016లో భారత ఆటోమోటివ్ రిసెర్చ్ అసోసియేషన్ నిర్వహించిన పరీక్షల్లో దాదాపు లక్షన్నర డీజిల్ కార్లు అత్యధిక కార్బన్ ఉద్గారాలను కలిగివున్నట్టు తేలిందని ఐసిసీటీ మరో అధికారి ఫాంటా తెలిపారు. ఇండియాలో ప్రస్తుతం ఉన్న విధానాన్ని సమీక్షించాలని, ఉద్గార ప్రమాణాలపై కచ్చితమైన ఆదేశాలు జారీ చేయాలన్నారు.
కాగా పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు 2016-17 కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఎల్పీజీ, సీఎన్జీ కార్లపై 1 శాతం, డీజిల్ కార్లపై 2.5 శాతం, విలాసవంతమైన కార్లు, ఎస్యూవీలపై 4 శాతం పన్ను,పదిలక్షల విలువదాటిన కార్లపై1 శాతం పన్ను విధించిన సంగతి తెలిసిందే. మరి ఈపీసీఎ సూచనలపై సుప్రీం ఎలా స్పందించనుందో వేచి చూడాలి.
డీజిల్ వాహనాలపై 30 శాతం గ్రీన్ టాక్స్ ?
Published Wed, Apr 20 2016 12:35 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement